హైదరాబాద్, మహానది న్యూస్: హైదరాబాద్ నగరం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. భారీ వర్షాలతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ముంపు.. వంతెనల మీద నుంచి ప్రవహిస్తున్న వరద.. దీనికితోడు దసరా సెలవులతో లక్షలాది మంది సొంతూళ్ల ప్రయాణాలు.. వెరసి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనదారులు చుక్కలు చూశారు. మలక్పేట, చాదర్ఘాట్, లక్డీకాపూల్, నాంపల్లి, కోరి, ఉప్పల్, నాగోల్, హయత్నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో రహదారుల మీద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి.
