శిధిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని వెంటనే తొలగిస్తాం – డిఈ బసవలింగం
మహానది, కల్వకుర్తి : నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లురవి, కల్వకుర్తి శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి లు గత నెలలో గుండూర్ గ్రామంలో పర్యటించిన సందర్భంగా గ్రామస్తులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శిధిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని తొలగించాలని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన వారు సంబంధిత అధికారులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సురభి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఈరోజు గుండూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శితిలావస్థలో వున్న పాత భవనాలను పంచాయతీ రాజ్ శాఖ డీఈ బస్వలింగం, ఏఈ షబ్బీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో శితిలావస్థలో వున్న భవనాలను త్వరలోనే తొలగించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు నంబి శంకర్, పోతుగంటి రాజు, కార్యకర్తలు జంగిటి శేఖర్, పోతుగంటి అశోక్, మంగ నాగేష్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు వున్నారు.
