మహానది, హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అదనపు సౌకర్యాలపై మీడియా ప్రతినిధులకు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే దసరా, దీపావళి, ఛట్ పూజ పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణీకుల రద్దీని సజావుగా క్రమబద్ధంగా నిర్వహించడానికి అనేక చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా పండుగ రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి జోన్ చేసిన ఏర్పాట్లను వివరించడానికి దక్షిణ మధ్య రైల్వే అక్టోబర్ 24, 2025న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాల కృష్ణన్ సికింద్రాబాద్ స్టేషన్లో అమలు చేయబడిన జనసమూహాల నిర్వహణ పద్ధతుల గురించి మీడియా సిబ్బందికి వివరించారు. వీరితోపాటు సికింద్రాబాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్/ఆపరేషన్స్ ఎ. సంజీవరావు, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్; సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ షిఫాలి ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే పండుగ సీజన్ కోసం సికింద్రాబాద్ డివిజన్ గ్రేడెడ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ను అభివృద్ధి చేసిందని అన్నారు. ప్రయాణీకులు వాహనాల కదలిక, ఫుట్ ఓవర్ బ్రిడ్జి వినియోగం, ఎక్కువ రద్దీగా ఉన్న సమయాన్ని అంచనా వేయడం, స్టేషన్కు చేరుకునే ట్రాఫిక్ అధ్యయనం మొదలైన వాటి గురించి వివరణాత్మక సర్వేలు నిర్వహించబడ్డాయి. సికింద్రాబాద్ స్టేషన్లో పునరాభివృద్ధి పనులు జరుగుతున్న ఈ కీలకమైన సమయంలో జనసమూహ నిర్వహణను ప్లాన్ చేయడంలో ఈ అంచనాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని సికింద్రాబాద్ స్టేషన్కు సగటున 1.34 లక్షలు మంది వస్తుండగా, పండుగల సీజన్లో ఇది దాదాపు 1.84 లక్షలకు చేరుకుంటుందని తెలిపారు .
ప్లాట్ఫారమ్కు ఒకవైపు గేట్ 2, గేట్ 4 వద్ద కొత్త హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయడం, కాజీపేట చివర వైపు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తెరవడం, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ వైపు కొత్త ఎగ్జిట్ గేట్ 5A తెరవడం వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలల గురించి కూడా ఆయన వివరించారు. ప్రధాన నగర టెర్మినల్స్లో రద్దీని తగ్గించడానికి, అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లోని 24 రైళ్లకు లింగంపల్లి, హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో అదనపు స్టాప్లను సమర్థవంతంగా ఏర్పాటు చేయబడినాయి. వీటితోపాటు 92 కెమెరాలతో కూడిన పటిష్టమైన సి.సి.టి.వి నిఘా, మెరుగైన మౌలిక సదుపాయాలు గల 17 టికెటింగ్ కౌంటర్లు, 20 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు, సికింద్రాబాద్ స్టేషన్, డివిజనల్ ప్రధాన కార్యాలయాలలో వార్ రూమ్ల ఏర్పాటు వంటివి సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం కొన్ని చర్యలు తీసుకొనబడినాయి. అన్ని విభాగాలను సమన్వయం చేయడం ద్వారా కార్యాచరణ ప్రణాళిక అమలు గురించి కూడా ఆయన వివరించారు.
వాటిలో కొన్ని
గేట్ల వద్ద నియంత్రిత ప్రవేశం/నిష్క్రమణ, ఎఫ్. ఓ. బి పై రద్దీ లేకుండా చేయడం , హాట్స్పాట్ పర్యవేక్షణ, క్యూ నిర్వహణ, ప్రయాణీకుల సహాయం/మార్గదర్శకత్వం నిర్ధారించడానికి ఆర్. పి. ఎఫ్ టికెట్ తనిఖీ సిబ్బందితో కూడిన వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి.
• 24 గంటలూ వార్ రూమ్ల నిర్వహణ
• దానాపూర్ ఎక్స్ప్రెస్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్ వంటి గుర్తించబడిన రైళ్లకు క్యూ వ్యవస్థలను సక్రమంగా నిర్వహించడం.
• అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకుల యాక్సెస్ నియంత్రణ. జనరల్ టిక్కెట్లు ప్లాట్ఫామ్ టిక్కెట్ల అమ్మకాలను నియంత్రించడం ద్వారా అక్టోబర్ 19 నుండి 21 వరకు దానాపూర్ ఎక్స్ప్రెస్కు కూడా ఇదే విధానాన్ని అమలు చేయడమైనది .
• ప్రయాణీకులు యూ. టి. ఎస్ మొబైల్ యాప్ రైల్ వన్ యాప్లను ఉపయోగించుకునేలా ప్రోత్సహించడానికి చురుకైన అవగాహన ప్రచారాలు నిర్వహించడమైనది .
• రైలు రాకపోకలు/నిష్క్రమణలు, ప్రత్యేక రైళ్లు, స్టేషన్లలో ప్లాట్ఫారమ్ నంబర్లు కోచ్ స్థానాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో సకాలంలో ఖచ్చితమైన వ్యాప్తి చేయడం.
• ప్రయాణీకులకు సురక్షితమైన ప్రయాణం కోసం పునరాభివృద్ధి చేయబడుతున్న ప్రదేశాలలో, సరైన బారికేడింగ్ నిర్మాణ సామగ్రిని తొలగించడం.
డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ సికింద్రాబాద్ స్టేషన్లో రైళ్ల నిర్వహణ స్టేషన్లో రద్దీని నియంత్రించడం గురించి మీడియా ప్రతినిధులతో సంభాషించారు. అంతకు ముందు, సికింద్రాబాద్ డి.ఆర్.ఎం. సీనియర్ అధికారులు మీడియా ప్రతినిధులతో కలిసి హోల్డింగ్ ప్రాంతాలు, బుకింగ్ కౌంటర్లు, నూతన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని సందర్శించి రద్దీ నియంత్రణ చర్యల పై ప్రస్తుతం అమలు చేస్తున్న విధివిధానాలపై సమగ్ర చిత్ర మాలికను మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు.
దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీ ఎ. శ్రీధర్ మీడియాను స్వాగతిస్తూ, పండుగ సీజన్లో రద్దీ పెరగడం కొనసాగుతున్న పునరాభివృద్ధి పనుల దృష్ట్యా స్టేషన్లో అమలు చేయబడుతున్న రద్దీ నిర్వహణపై తీసుకున్న వ్యూహాల ప్రాముఖ్యతను వివరించారు. అన్ని విభాగాల సహకారం, సమన్వయం వల్ల రైలు వినియోగదారులు రైళ్లు ఎక్కడానికి, దిగడానికి సజావుగా, ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణించేలా చర్యలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు.
