ఓటర్ల జాబితా తప్పుల తడక

పారదర్శకంగా ఉండేలా సవరించాలి

మహానది, ఎల్బీనగర్:

ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రాక్ టౌన్ కాలనీలో నవంబర్ 16న జరుగనున్న కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలను సక్రమంగా జరపాలని సొసైటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్టు మామిడి సోమయ్య ఎన్నికల అధికారిని కోరారు. సొసైటీ ఓటర్ల జాబితాను పరిశీస్తే…పూర్తిగా తప్పుల తడకగా ఉందని, వెంటనే జాబితాను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం సాయంత్రం స్థానిక సొసైటీ కార్యాలయంలో సొసైటీ ఎన్నికల అధికారికి వినతి పత్రం అందజేశారు. సొసైటీలో దాదాపు 863 మంది ఓటర్లు ఉండగా వీరిలో చాలా మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుందని, వందకు పైగా ఓటర్లకు సంబంధించిన చిరునామాలు గానీ, ఫోన్ నెంబర్లు గానీ లేవని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా స్థానిక అడ్రస్ లో లేని ఓపెన్ ప్లాట్ యజమానులైన ఓటర్లను గుర్తించేందుకు ఎటువంటి ఆధారం లేకుండా బోగస్ ఓటర్లు ఓట్లు వేసే అవకాశం ఉందని, అలాంటి ఓటర్ల స్థానికతను నిరూపించే గుర్తింపు పత్రాలను ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. తప్పుల తడకగా ఉన్న ఓటర్ల జాబితాను సవరించి సొసైటీ ఎన్నికలు సక్రమంగా, సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *