తెలంగాణ వైన్స్ టెండర్లలో తెల్ల రేషన్ కార్డుల దుర్వినియోగం — విచారణ అవసరం
తెలంగాణలో వైన్స్ టెండర్లు ముగిసిన నేపధ్యంలో తెల్ల రేషన్ కార్డుల దుర్వినియోగంపై చర్చ మళ్లీ తీవ్రతరంగా మొదలైంది. కోట్లకు చేరువైన వ్యయాలతో టెండర్లలో పోటీ పడే స్థోమత ఉన్న వ్యక్తుల వద్ద ఇంకా తెల్ల రేషన్ కార్డులు కొనసాగుతుండటం పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం మాత్రమే ఉద్దేశించిన గుర్తింపును భారీ ఆర్థిక లావాదేవీలకు పాల్పడే వ్యక్తులు తమ వద్ద ఉంచుకోవడం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న సమాజంలో చర్చనీయాంశమైంది.

వైన్స్ లైసెన్సు పొందడం చిన్న విషయం కాదు. ఒక్కో దరఖాస్తుకే లక్షల్లో ఖర్చవుతుంది. లైసెన్సు మంజూరు అయితే మరిన్ని ఆర్థిక భారాలు మొదలవుతాయి. దుకాణం నెలకొల్పడంనిర్వహణ ఖర్చులుసంవత్సరానికి కోట్లు విలువైన మద్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత— ఇవన్నీ అధిక పెట్టుబడులు పెట్టగలిగిన వారికే సాధ్యం. అలాంటి వారు తెల్ల రేషన్ కార్డుల జాబితాలో ఉండటం అనుమానాస్పదమే కాకుండా పేదలకు అన్యాయం కూడా.

ఇటీవలి కాలంలో వెలువడిన ఆరోపణల ప్రకారంకొందరు వ్యాపారులు నేరుగా తమ పేర్లతో టెండర్లలో పాల్గొనకుండా బినామీలను ముందుకు తేవడమే కాదుపేదలకు సంబంధించిన ఆధార్ వివరాలను లైసెన్సుల కోసం ఉపయోగిస్తున్నట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ విధంగా నిజమైన లైసెన్సు దారులు నీడలో ఉండగా పేదల పేర్లు ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించబడటంతో సమస్య మరింత క్లిష్టమవుతోంది. దీనివల్ల అసలు హక్కులు కోల్పోతున్న పేద కుటుంబాలు నష్టపోతుండటం పై ప్రాంతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  ఈ పరిస్థితుల్లో టెండర్ విజేతల వివరాలను రేషన్ డేటాబేస్‌తో తక్షణమే పోల్చిఅర్హతలేని వ్యక్తులు తెల్ల రేషన్ కార్డులు ఉపయోగిస్తున్నారా అన్న అంశంపై సమగ్ర విచారణ అవసరం ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పేదల కోసం ఉద్దేశించిన పథకాల ప్రయోజనాలు వేరే వర్గాల చేతుల్లోకి వెళ్లకుండా రక్షించాలంటే రేషన్ కార్డుల వ్యవస్థలో పారదర్శకత తప్పనిసరి. వైన్స్ వ్యాపారం వంటి భారీ పెట్టుబడులు పెట్టగలిగే వ్యక్తులు పేదరిక ప్రమాణాలలోకి రావడం అసాధ్యం. అయినప్పటికీ తెల్ల కార్డులు కొనసాగడం వ్య‌వ‌స్థ‌లో లోపాల‌ను సూచిస్తోంది. ఈ సమస్యను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటేనే నిజమైన పేదలకు సరైన హక్కులు చేరతాయి.

తెల్ల రేషన్ కార్డు అన్నది కేవలం సబ్సిడీ బియ్యం మాత్రమే కాదుపలు సంక్షేమ పథకాల ప్రవేశద్వారం కూడా. ఆ కార్డులను వ్యాపార లాభాల కోసం వినియోగించడం పేదల హక్కులపై ప్రత్యక్ష దాడి. వ్యాపార అవసరాలకు బినామీలు ఉపయోగించడంపేదల వివరాలను దుర్వినియోగం చేయడం వంటి చర్యలు నివారించకపోతే సమస్య మరింత విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వైన్స్ టెండర్ల నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఈ అంశంపై విస్తృత విచారణ చేపట్టి రేషన్ కార్డుల అర్హతలను పూర్తిగా పునఃసమీక్షించాలన్న ప్రజాభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పేదలకు చేరాల్సిన హక్కులు వారికి చేరేందుకు సమగ్ర పరిశీలనకఠిన చర్యలు అవసరమనే డిమాండ్ మరింత పెరుగుతోంది.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *