అండర్–17 కబడ్డీ పోటీలకు సిద్ధమైన బయ్యారం — ఏర్పాట్లు పరిశీలించిన డీఎస్పీ రవీందర్ రెడ్డి

పినపాక, మహానది న్యూస్ నవంబర్ 04 :

పినపాక మండలం బయ్యారం ప్రభుత్వ హైస్కూల్‌లో జరగనున్న రాష్ట్ర, జాతీయ స్థాయి అండర్–17 కబడ్డీ క్రీడా పోటీల ఏర్పాట్లను డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు క్రీడా మైదానం, భద్రతా ఏర్పాట్లు, ఆటగాళ్ల వసతి, తాగునీటి సదుపాయాలు తదితర అంశాలను సమీక్షించి సూచనలు జారీ చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి క్రీడలను విజయవంతంగా నిర్వహించాలన్నారు.

డీఎస్పీ మాట్లాడుతూ — “ప్రతిభావంతులైన విద్యార్థులు క్రీడా రంగంలో ముందుకు రావడానికి ఇటువంటి పోటీలు మంచి వేదికగా ఉంటాయి. భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి,” అని తెలిపారు.

క్రీడా మైదానంలో విద్యార్థులు సాధన చేస్తున్న దృశ్యాలను పరిశీలించిన అనంతరం అధికారులు నిర్వాహకులు  అభినందించారు.

చివరగా ఉపాధ్యాయులతో మాట్లాడి, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, ప్రతిభా వికాసంపై చర్చించారు. ప్రతి ఉపాధ్యాయుడు తన పాఠశాలలో మార్పు తీసుకురాగలడని, వారి కృషితో ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శవంతమైనవిగా నిలుస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ ప్రణాళిక సమన్వయకర్త ఎన్. సతీష్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *