జిల్లా స్థాయి వీడియో సమావేశంలో విద్యా, గ్రామీణాభివృద్ధి అంశాలపై సమీక్ష

మణుగూరు, మహానది న్యూస్, నవంబర్ 06:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి మరియు గౌరవ అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ప్రాజెక్టు అధికారులు, విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎంజిఎన్ ఆర్ఇజిఎస్ సిబ్బంది పాల్గొనే విధంగా సమగ్ర వీడియో సమావేశం నిర్వహించబడింది.

సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు విద్యా, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమం 5.0 అమలు, అమ్మకు అక్షరమాల (ఉల్లాస్) కార్యక్రమం, పోషణ పథకం, విద్యా అధికారి పర్యటన నివేదికలు, హాజరు వ్యవస్థ అమలు, ఎంజిఎన్ ఆర్ఇజిఎస్ సామాజిక ఆడిట్ అంశాలు, ఆధార్ ధృవీకరణ పూర్తికి సంబంధించిన చర్యలపై విస్తృత చర్చ జరిగింది.

మణుగూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం నుండి విద్యాశాఖ అధికారి మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి కె. నాగలక్ష్మి పాల్గొని మండల పరిధిలో చేపట్టిన కార్యక్రమాల వివరాలు అందించారు. మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని కార్యక్రమాల పురోగతిని వివరిస్తూ అవసరమైన వివరాలను సమర్పించారు. జిల్లా అధికారులు ప్రతిభాగం తమ బాధ్యతల పట్ల నిబద్ధతతో వ్యవహరించి, కార్యాచరణ పర్యవేక్షణను బలోపేతం చేయాలనే సూచనలు చేశారు. సమావేశం విజయవంతంగా ముగిసింది.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *